Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గృహ నిర్బంధంలో ప్రభాస్.. కృష్ణంరాజు క్లారిటీ
ఇటీవలే జార్జియా నుంచి తిరిగి వచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఆయన చెల్లెలు సాయి ప్రసీద (కృష్ణంరాజు పెద్ద కుమార్తె) సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారని రెబల్స్టార్ కృష్టంరాజు తెలిపారు. ఈ మేరకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన వారు తమకు ఎలాంటి అస్వస్థత లేకపోయినప్పటికీ ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చి స్వచ్ఛంద గృహనిర్బంధంలోకి వెళ్ళటం వారి బాధ్యత.
వారి కుటుంబ సభ్యులు కూడా ఇందుకు పూర్తిస్థాయిలో సహకరించాలి. మా అబ్బాయి ప్రభాస్, అమ్మాయి సాయి ప్రసీద అమెరికా నుంచి వచ్చిన వెంటనే అధికారులకు సమాచారం అందజేసి సెల్ఫ్ క్వారంటిన్లోకి వెళ్లిపోయారు అని తెలియజేశారు.
జనతా కర్ఫ్యూ విజయవంతం అయినందుకు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు మరియు మీడియా వారికి సంఘీభావంగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు రెబల్ స్టార్ కృష్ణంరాజు, ఆయన సతీమణి శ్యామలా కృష్ణంరాజు చప్పట్ల ద్వారా తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ "కరోనా కష్టాన్ని ఎదుర్కొంటున్న దేశ ప్రజలకు ప్రధాని మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ అనే పిలుపు తారకమంత్రంగా పని చేసింది. ఈ కార్యక్రమంతో ప్రజలలో కరోనా పట్ల పూర్తిస్థాయి అవగాహన ఏర్పడింది అని అన్నారు.
సాహో తర్వాత నటిస్తున్న తన తాజా చిత్రం కోసం ప్రభాస్ ఇటీవల జార్జియాకు వెళ్లారు. కరోనావైరస్ భయాల నేపథ్యంలో షూటింగ్ను వాయిదా వేసుకొని ప్రభాస్, పూజాహెగ్డేతోపాటు చిత్ర యూనిట్ హైదరాబాద్కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్వీయ గృహనిర్బంధంలో ప్రభాస్ ఉన్నారు. ఆదివారం బాల్కనీలోకి చప్పట్లు కూడా కొట్టకపోవడం గమనార్హం.