Don't Miss!
- News పార్టీ మార్పుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏమన్నారంటే?
- Sports Navjot Singh Sidhu: సచిన్ కాదు.. టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ అతనే!
- Lifestyle శ్రీ కృష్ణుడు గోపికలతో మొదలై హోలీ పండగ గురించి ఆసక్తికరమైన విషయాలు.!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
SVP 5 Days Collections: మహేశ్ మూవీకి బిగ్ షాక్.. పవన్ సినిమాలో సగమే.. ఇంకెంత రావాలంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. అంతలా అతడు దాదాపు రెండు దశాబ్దాలుగా వరుస హిట్లతో టాలీవుడ్లో హవాను చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకున్న మహేశ్.. ఇప్పుడు 'సర్కారు వారి పాట' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా భారీ ఆదరణను దక్కించుకుంటోంది. ఫలితంగా కలెక్షన్లను కూడా అదే రీతిలో రాబడుతూ టార్గెట్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'సర్కారు వారి పాట' మూవీ 5 రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!
సర్కారు వారి పాటలో స్టార్ హీరో
ఈ మధ్య కాలంలో సూపర్ ఫామ్లో ఉన్న మహేశ్ బాబు తాజాగా చేసిన చిత్రమే 'సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. దీనికి థమన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సముద్రఖని విలన్గా చేశారు.
హీరోయిన్ హాట్ వీడియో షేర్ చేసిన వర్మ: ఈ టైమ్లో ఆ సౌండ్స్ బాగుంటాయి అంటూ!
సర్కారు వారి పాట బిజినెస్ ఇలా
క్రేజీ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు అన్ని ప్రాంతాల్లోనూ పోటీ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని ఈ సినిమాకు రూ. 120 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
5వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 5వ రోజు 'సర్కారు వారి పాట'కు రెస్పాన్స్ తగ్గిపోయింది. దీంతో నైజాంలో రూ. 1.12 కోట్లు, సీడెడ్లో రూ. 52 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 69 లక్షలు, ఈస్ట్లో రూ. 38 లక్షలు, వెస్ట్లో రూ. 24 లక్షలు, గుంటూరులో రూ. 25 లక్షలు, కృష్ణాలో రూ. 26 లక్షలు, నెల్లూరులో రూ. 18 లక్షలతో కలిపి రూ. 3.64 కోట్లు షేర్, రూ. 6 కోట్లు గ్రాస్ వచ్చింది.
హాట్ డోస్ పెంచిన సీరియల్ నటి: పెళ్లైన కొత్తలోనే ఇలా రెచ్చిపోయిందేంటబ్బా!
5 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
ఏపీ, తెలంగాణలో 'సర్కారు వారి పాట' 5 రోజులకు కలిపి బాగా రాబట్టింది. ఫలితంగా నైజాంలో రూ. 28.67 కోట్లు, సీడెడ్లో రూ. 9.34 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 10.06 కోట్లు, ఈస్ట్లో రూ. 6.87 కోట్లు, వెస్ట్లో రూ. 4.39 కోట్లు, గుంటూరులో రూ. 7.76 కోట్లు, కృష్ణాలో రూ. 4.78 కోట్లు, నెల్లూరులో రూ. 2.89 కోట్లతో కలిపి రూ. 74.76 కోట్లు షేర్, రూ. 108.60 కోట్లు గ్రాస్ రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో రూ. 74.76 కోట్లు వసూలు చేసి సత్తా చాటిన 'సర్కారు వారి పాట'.. మిగిలిన ప్రాంతాల్లోనూ బాగా రాణించింది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.40 కోట్లు, ఓవర్సీస్లో రూ. 11.20 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా 5 రోజుల్లోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 91.37 కోట్లు షేర్తో పాటు రూ. 143.30 కోట్ల గ్రాస్ వచ్చింది.
మసాజ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్: ఒంటిపై నూలుపోగు లేకుండా ఘోరంగా!
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
క్రేజీ కాంబినేషన్లో 'సర్కారు వారి పాట' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 121 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 5 రోజుల్లో రూ. 91.37 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 29.63 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ స్టేటస్ను సొంతం చేసుకుంటుంది.
పవన్ మూవీ కంటే సగం మాత్రమే
భారీ బడ్జెట్తో రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీ ఐదో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 3.64 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేసింది. అయితే, పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' మూవీ ఏకంగా రూ. 7.25 కోట్లు రాబట్టింది. అంటే ఐదో రోజు మహేశ్ మూవీకి సగం కలెక్షన్లు కూడా రాలేదు. ఫలితంగా ఈ మూవీకి వీక్ డేస్లో అసలైన పరీక్ష మొదలైనట్లు అయింది.